CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.