NDL: ఆత్మకూరు పట్టణంలో శునకాలు ప్రజల్ని భయపెడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పట్టణంలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో శునకాలు చేరడంతో ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యపై అనేకమార్లు పట్టణవాసులు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.