సత్యసాయి: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నారా లోకేశ్తో కలిసి సోమవారం పర్యటించారు. టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ను సందర్శించారు. వైద్యం కోసం అక్కడ వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్లో అందుతున్న సేవలు గురించి అధికారులు, రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు.