అనంతపురం రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు NDPS చట్టం కఠిన శిక్షలపై అవగాహన కల్పించారు. రైళ్లు, ప్లాట్ఫారమ్లో తనిఖీలు నిర్వహించగా నిషేధిత పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.