కృష్ణా: వేటపై ఆధారపడి జీవించే యానాది కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం ఫుడ్ కోర్టులో 80 పేద కుటుంబాలకు నాబార్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ ద్వారా ప్రజా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 50లక్షలు విలువైన పడవలు అందజేశారు.