విజయనగరం: కొత్త సంవత్సరం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని గుర్ల ఎస్సై నారాయణరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. డిసెంబర్ 31న, డీజేలు, శబ్ద కాలుష్యం చేయకూడదని సూచించారు. రోడ్లపై గుంపులుగా సంచరిస్తే చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలని హితవు పలికారు.