KRNL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం రాత్రి వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సర్కారీ సేవలో భాగంగా దేవస్థానం ప్రతినిధులు ముందుగా సహస్రదీపాలంకరణ పూజల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవ సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.