ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.