BPT: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం ఎస్సై శివకుమార్ వాహన తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు సరిగా లేని వారికి జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.