సత్యసాయి: గోరంట్ల మండలం బూదిలి పంచాయతీకి చెందిన వైసీపీ పార్టీ ఎంపీటీసీ మంజు పార్టీ విడి సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.