VSP: సంక్రాంతి పూర్తయిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు(08517/18)నడుపుతున్నట్లు వాల్తేర్ డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. రైలు జనవరి 18న మధ్యాహ్నం 3:50కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30కు చర్లపల్లి చేరుతుంది. తిరుగి ప్రయాణంలో చర్లపల్లి నుంచి 19న బయలుదేరి 20న అర్ధరాత్రి విశాఖ చేరుతుంది.