KKD: కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డా. కందుల ఆంజనేయుల మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతానికి పైగా మార్కులు సాదించి, నెట్, సెట్తో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.