PLD: సంక్రాంతి పర్వదినాన లింగారావుపాలెం, జాలాది గ్రామాల్లో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న తెప్పలపై శైవ, వైష్ణవ మూర్తులు జలవిహారం చేశారు. వేద మంత్రాలు, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పండుగ వాతావరణంలో సెల్ఫీలు, ఫోటోలతో సందడి చేశారు.