సత్యసాయి: సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ వి.రత్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని 35 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.