ప్రకాశం: రాచర్ల లోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.