ELR: ములగలంపల్లి పంచాయతీ పాకలగూడెంలో గ్రామంలో మంచినీటి ట్యాంక్ గుండా రెండు నెలలుగా రంగు మారిన నీరు వస్తుండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే నీటిని తాగడంతో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్, పైపులను సిబ్బంది శుభ్రం చేయడం లేదన్నారు. అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీరు అందించాలని కోరుతున్నారు.