కర్నూలు రేంజ్ పరిధిలోని 31 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. పరిపాలన సౌలభ్యం, సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్వహణ దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు.