GNTR: ఉండవల్లి వేదికగా గురువారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో నారా లోకేశ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడి నాయకత్వమే పార్టీకి శిరోధార్యమని, అందరూ ఒకే అజెండాతో సైనికుల్లా కదలాలని పిలుపునిచ్చారు. ప్రజాదర్బార్ల ద్వారా జనం చెంతకు చేరి, రాబోయే ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా శ్రమించాలని కార్యకర్తలను లోకేశ్ కోరారు.