ప్రకాశం: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. ఢిల్లీలోని పార్లమెంట్లో ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించారు. రాష్ట్రాలకు జీఎస్టీ వాట 50 శాతం నుండి 70 శాతానికి పెంచాలని, రూ. 1.50 లక్షల కోట్లు నిధులు గృహనిర్మాణాలకు ఇవ్వాలని, కనిగిరి నిమ్జ్, బకింగ్ హాం కాలువ వునరుద్ధరణకు వెంటనే నిధులు ఇవ్వాలని కోరారు.