ASR: విద్యుత్ చార్జీలపై ఈనెల 20నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జీఎన్ ప్రసాద్ గురువారం తెలిపారు. ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో 20నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నామన్నారు. పాడేరు జిల్లా కార్యాలయంలో ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.