KDP: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని అడవిలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజాము కూంబింగ్ చేపట్టారు. 26 ఎర్రచందనం దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు నారాయణరెడ్డి, అహమ్మద్ మాట్లాడుతూ.. మద్దిమడుగు ఫారెస్ట్ సెక్షన్లో కూబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డారని చెప్పారు.