Akp: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పద జాలంతో పోస్టులు పెడుతున్న మడుతూరుకు చెందిన వైసీపీ నాయకుడు గోవిందుపై జనసేన నాయకులు అచ్యుతాపురం సీఐ గణేష్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చెడగొట్టాలనే లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తూన్నారన్నారు.