PLD: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు ముద్దాయిలను నకిరేకల్లు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ. 25,70,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.