VKB: పాంబండ రామలింగేశ్వర స్వామికి భక్తులు భారీ కానుకలు సమర్పించారు. షాద్నగర్కు చెందిన శాలిని అమర్నాథ్ దంపతులు 95 తులాల వెండి గణపతి తొడుగును, అంతారం గ్రామానికి చెందిన బాసుపల్లి శాంతి రెడ్డి 50 కిలోల ఇత్తడి గంటను ఆలయానికి బహుకరించారు. ఈ కానుకలను స్వీకరించిన అర్చకులు వారికి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. భక్తుల దాతృత్వంపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది.