KKRతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ముంబై తరపున తన అరంగేట్రం మ్యాచ్లోనే శార్దుల్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందే LSG నుండి ట్రేడింగ్ ద్వారా MI శార్దుల్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.