W.G: నరసాపురం మాధవాయిపాలెంలోని శ్రీ రామాలయంలో సీతారాముల వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామి వారు భానుమూర్తిగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సూర్య వాహనంపై స్వామి వారిని పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.