HYD: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిన్న ఆయన ప్రారంభించారు. కాలనీవాసులు సామాజిక బాధ్యతతో కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నేరాల నివారణతో పాటు నేరస్తులను గుర్తించడంలో ఇవి ఉపయోగపడతాయన్నారు.