BDK: ఆళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నేడు ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తారని ఏఈవో ఆర్ విజయ వంశీ తెలిపారు. వ్యవసాయ నిపుణులు సందేహాలకు సమాధానాలు ఇస్తారని ఆయన తెలిపారు. యూరియా యాప్, సహజ వ్యవసాయం, సిరికల్చర్, మామిడి దిగుబడులు, కోళ్ల పెంపకం, వరి పంటలో పురుగుల నియంత్రణపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.