HYD: మహానగరంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు పెరగడంతో వినియోగం గరిష్ట స్థాయికి చేరింది. రోజుకు సుమారు 81 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల ప్రభావంతో ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగించడంతో లోడ్ పెరిగిందని, సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.