GDWL: ఈ నెల 25న గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ ఆంజనేయస్వామి, గణపతి, బొడ్రాయి, లింగమయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని గ్రామస్తులు ఆదివారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవేందర్ మాట్లాడుతూ.. భక్తిభావం మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతుంది అని అన్నారు.