అన్నమయ్య: ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని మండల కేంద్రంలోని టీడీపీ యువకులు పోస్టర్లను విడుదల చేసి ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువ నాయకుడు తోహిద్ ఖాన్ మాట్లాడుతూ, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారిని కాపాడగలమని తెలిపారు.