KRNL: ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని DIG, జిల్లా ఇంఛార్జ్ SP విక్రాంత్ పాటిల్ ఇవాళ హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మవడి వంటి పథకాల పేరుతో ఆకర్షణీయ సందేశాలు పంపి ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పవద్దన్నారు.