AKP: పాయకరావుపేట(మం) శ్రీరాంపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. బైక్పై వెళుతున్న నామవరపు లోకేష్, కార్తీక్ కుమార్ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరిద్దరితోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్పై వెళుతున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. వీరిని 108 అంబులెన్స్పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ అప్పన్న తెలిపారు.