సత్యసాయి: బత్తలపల్లి మండలంలో టీడీపీ మద్దతుదారు నాగరాజుపై బుధవారం రాత్రి దాడి జరిగింది. పోట్లమర్రి గ్రామంలో నాగరాజుతో పాటు అతడి తల్లి నాగలక్ష్మి, తమ్ముడు చంద్రశేఖర్, నాగజ్యోతిలపై దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ నేతలే తమపై దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.