మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హర్రర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. లాస్ ఏంజెల్స్లోని అకాడమీ మ్యూజియంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న ‘వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ’ అనే వేడుకలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో ఈ వేడుకకు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.