ADB: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ గ్రామంలోని నవేగాం గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.