WNP:పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీధర్ కుమారుడు టెన్త్ క్లాస్ చదువుతున్న రుద్ర నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 6,7తేదీలలో సంగారెడ్డిలో జరిగిన కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్న రుద్ర గోల్డ్ మెడల్ సాధించినట్లు కిక్ బాక్సింగ్ మాస్టర్ శేఖర్ తెలిపారు. 2026 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే పోటీలలో రుద్ర పాల్గొననున్నారు.