కర్నూలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల సమావేశం మొత్తం 119 ఫిర్యాదులు సేకరించనట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా విని, ప్రతి ఫిర్యాదుపై విచారణ చేసి చట్టపరంగా న్యాయం చేస్తామని వెల్లడించారు. సంబంధిత పోలీసు అధికారులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.