W.G: కార్మికుల పక్షాన సమరశీల పోరాటాలు చేస్తున్న సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి పీ.వీ ప్రతాప్ కోరారు. సోమవారం తణుకు అమరవీరుల భవనంలో సీఐటీయూ మండల సమావేశం జరిగింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈనెల 15న మహాసభలు ప్రారంభ సూచికంగా అన్ని యూనియన్ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరణ చేయాలని కోరారు.