ATP: వైసీపీ అనుబంధ కమిటీలలో జిల్లా నేతలకు చోటు దక్కింది. అనంతపురానికి చెందిన రాజేష్రెడ్డి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. కళ్యాణదుర్గానికి చెందిన రాము బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, నాగలక్ష్మి మహిళా విభాగం జాయింట్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.