TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రెఫరెండం అన్నవారిని ప్రజలు బండకేసి కొట్టి బొందపెట్టారని వ్యాఖ్యానించారు. నెల రోజులు తిరగకముందే KTR మళ్లీ రోడ్లపైకి వచ్చి అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.