AP: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్షంగా CM చంద్రబాబు రేపు రాత్రి లండన్కు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లనున్న ఆయన లండన్లో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. పెట్టుబడులకు కల్పిస్తున్న అనువైన వాతావరణం, ప్రోత్సాహం తదితరాలను సైతం వివరించనున్నారు.