MHBD: గూడూరు మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో శనివారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ, నియమావళిపై రాజకీయ నాయకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MRO నాగభవాని, ఇంఛార్జీ MPDO సత్యనారాయణ, SI గిరిధర్ రెడ్డి ఉన్నారు.