SKLM: నెహ్రూ యువ కేంద్రంలో అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ నేషనల్ మోడలేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టీమ్ మెంబెర్ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ITI, డిప్లమాలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.