SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పేరొందిన ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకి ఆలయంలో ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వయుజమాసం, శుక్లపక్షం, షష్టి భాను వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.