KKD: కరప మండలం పెనుగుదురు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సైకిల్పై వస్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై తోట సునీత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు