NLG: గురుకుల ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీటీఏ కృషి చేస్తుందని ఆ సంఘం నాయకులు అన్నారు. సోమవారం పిట్టలగూడెంలోని మైనార్టీ కళాశాలలో సభ్యత్వ సేకరణ చేపట్టారు. గురుకుల పాఠశాలల పని వేళల మార్పు కోసం పీఆర్టీటీఏ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ ఫారూక్, బోడ వెంకన్న, బజ్జరి గోవర్ధన్, కోమటి రామకృష్ణ పాల్గొన్నారు.