KRNL: అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఇంఛార్జ్ DRO వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గడువులోగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.