RR: షాబాద్ మండలంలోని నరెండ్ల గూడ, దామర్లపల్లి, అంబేద్కర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేవెళ్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ పామేన భీమ్ భరత్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింలు ఉన్నారు.