ప్రకాశం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీల్లోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్కాపురంలో సోమవారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సొంత ప్రాంతాల్లో ఉద్యోగం చేసే హక్కు ఉండాలన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.